కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట
1041 views
అనంతపురం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడంపల్లిలో టీడీపి బస్సు యాత్రలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం... కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడిని సెల్ఫీ ఛాలెంజ్కు బస్సు దిగకుండా అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గం.. ఆగిపోయిన బీటీపీ ప్రాజెక్ట్ కాలువ పనుల చూపిస్తూ సెల్ఫీ దిగిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి.. వాగ్వాదానికి దిగిన రెండు వర్గాలు. ఇటీవల మడకశిర నియోజకవర్గం టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.. ఈరన్న, తిప్పేస్వామి వర్గాలు గొడవకు దిగాయి.. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలా వరుసగా పార్టీలో వర్గపోరు బయటపడటం టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందనే చెప్పాలి.