అనంతపురం: కారు నుంచి రూ. కోటికి పైగా నగదు స్వాధీనం
అనంతపురం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానంతో స్కార్ఫియో వాహనంలో సోదాలు చేశారు.. అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ 1,15,48,500 నగదు పట్టుకున్న పోలీసులు.. స్కార్ఫియోలో వెళుతున్న ముగ్గురు అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన ధనుంజయ రెడ్డి, ముత్యాలప్ప, ప్రదీప్గా గుర్తించిన పోలీసులు.. వీరు తాము వ్యాపారులమని చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించిన పోలీసులు. వీరు ఆ డబ్బులకు సంబంధించిన సరైన పత్రాలు తీసుకొచ్చి చూపిస్తే ఆ డబ్బులను తిరిగి అప్పగిస్తామంటున్నారు. గతంలో కూడా ఇక్కడ డబ్బులు, అక్రమ బంగారం దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి.