ముద్రగడ పద్మనాభంకు హరిరామ జోగయ్య స్ట్రాంగ్ వార్నింగ్
ఏలూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
ముద్రగడ పద్మనాభం కాపులకు ఏకైక నాయకుడిగా ఉండాలని తాపత్రయ పడుతున్నారని విమర్శించారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ మీద బురద చల్లి సీఎం జగన్కు ఉపయోగపడటమే ముద్రగడ టార్గెట్ అన్నారు. కాపులకు పవన్ మాత్రమే నాయకుడు కాదని.. ఆయన అన్ని వర్గాల నాయకుడు అన్నారు. పిఠాపురంలో పద్మనాభంపై పవన్ పోటీ చేయాల్సిన అవసరం లేదు.. జనసైనికుడైనా ఓడిస్తారన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ కూడా ముద్రగడ లేఖ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ వదిలి, కోనసీమలో ఎక్కడ నుంచి పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తాము అన్నారు. ఎవరో ముద్రగడ భార్యను బూతులు తిట్టినట్టు పదే పదే సానుభూతి కోసం మాట్లాడటం సరికాదు అన్నారు సత్య.