అతివేగం.. బైక్ను ఢీకొట్టిన కారు, పాల వ్యాపారి దుర్మరణం
ఏలూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. బైక్ వస్తున్న పాల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు సమీపంలోని పెదవేగి మండలం జోగన్నపాలెం అడ్డరోడ్డు కనకదుర్గమ్మ సమీపంలో ఆదివారం (జూలై 10) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మచిలీపట్నానికి చెందిన కొంత మంది కారులో గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం అక్కడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు కుడి వైపునకు దూసుకెళ్లి.. ఎదురుగా ఏలూరు నుంచి వస్తున్న పాల వ్యాపారి వీర్రాజు బైక్ను ఢీకొట్టింది. ఆ దాటికి వీర్రాజు బైక్ సహా అమాంతం ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.