ఏపీలో చికెన్ ధరలు పెరిగాయి. కరోనా కారణంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యుల సూచనతో చాలామంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధర అమాంతం పెరిగిపోయింది. వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగింది. ధరల పెరుగుదలతో చాలామంది చికెన్ కొనేందుకు భయపడుతున్నారు. ఈ నెల నాలుగన ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది.