సీబీఐ, నేను కుమ్మక్కు అయితే.. నాకేమైనా ఎంపీ పదవి ఇస్తారా: దస్తగిరి
ఎంపీ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రమాదం పొంచి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. వివేకా కుమార్తె సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. డబ్బుకు ఆశపడే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశామని.. ఇప్పుడు అవసరం లేదు కాబట్టే సీబీఐకి నిజం చెప్పేశా అని దస్తగిరి స్పష్టం చేశారు.