వైఎస్ వివేకాను చంపిందెవరంటే.. అవినాష్ రెడ్డి సంచలనం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీత తన భర్తను కాపాడుకోవటం కోసమే తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. హత్య జరగడానికి ముందు రోజు కూడా వివేకా తన తరఫున ప్రచారం చేశారని ఆయన తెలిపారు. మైదుకూరులో వివేకా తనకు మద్దతుగా ప్రచారం చేశారా? లేదా అనేది విచారించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేసారు. ‘వివేకా హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలని.. పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సూచించారు. వివేకాది హత్య అని నిర్ధారించే ఈ లేఖను సీబీఐ అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదు? సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డిని కాపాడేందుకే ఇలా జరుగుతోందా? హత్య చేసి ఒక తప్పు చేశారు. ఇప్పుడు దాన్ని మాకు ఆపాదిస్తూ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు’ అంటూ అవినాష్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.kadapaTimesXP TeluguUpdated: 27 Apr 2023, 3:30 pm