కుటుంబపరువును రోడ్డు కీడుస్తున్నారు.. నోరుమూయండి.. షర్మిలపై మేనత్త ఫైర్
1490 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలపై జగన్ మేనత్త, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ స్పందించారు. వైఎస్ఆర్ ఇంటి ఆడబిడ్డలు అన్యాయంగా మాట్లాడుతున్నారని విమలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం పరువున రోడ్డుకు లాగుతున్నారని మండిపడ్డారు. షర్మిల, సునీత మాటలను భరించలేకపోతున్నానన్న విమలారెడ్డి.. పదే పదే వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి హత్య చేయటం వీళ్లేమైనా చూశారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ మీద వ్యక్తిగత కక్ష్యతోనే షర్మిల, సునీత ఇలాంటి పనులు, ఆరోపణలు చేస్తున్నారని విమలారెడ్డి ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబసభ్యుల జోక్యం ఉండొద్దని ఫ్యామిలీని దూరం పెట్టారని విమలమ్మ చెప్పారు. దీంతోనే జగన్ మీద వారికి కోపం ఉండొచ్చని చెప్పుకొచ్చారు. షర్మిల, సునీత పనుల వల్ల కుటుంబసభ్యులు అందరూ ఏడుస్తున్నారన్న విమలమ్మ.. వారు చేసేది చాలా తప్పని అన్నారు. మేనత్తగా చెప్తున్నా.. ఇకనైనా మారండి.. నోరు మూసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి గెలుపు కోసం అప్పట్లో వివేకానందరెడ్డి కూడా పనిచేశారన్న విమలమ్మ.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి అవినాష్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు