పులివెందులలో సీఎం జగన్.. వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించారు.
1617 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందులలో పర్యటించారు. అక్కడ వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాకీ, ఆర్చరీ క్రీడల్లో పాల్గొన్నారు.దేశమంతా పులివెందుల వైపు చూసేలా మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అలాగే జమ్మలమడుగు మండలం పర్యాటక ప్రదేశమైన గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీ విక్రమ్జిత్ సింగ్ ఒబెరాయ్తో కలసి భూమి పూజ చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ఒబెరాయ్ హోటల్స్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పులివెందులకు చేరుకున్న ఆయన రూ.3.25 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన పురపాలక కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.39 కోట్ల నిధులతో మొదటి విడత కింద పూర్తి చేసిన గరండాల్ రివర్ ఫ్రంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడ బోటు షికారును జెండా ఊపి ప్రారంభించారు.