ప్రియా అట్లూరి, వైఎస్ రాజారెడ్డితో వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల
3062 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిYS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు వచ్చారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. షర్మిల తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, ఇతర బంధువులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం గురించి స్పందిస్తూ.. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు.