నిందితులను ఛేజ్ చేస్తూ కానిస్టేబుల్ మృతి
1179 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండినిందితులను పట్టుకునే క్రమంలో వారి వాహనాన్నే ఢీకొని ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు మండలం వెంకన్నబావి బాలాజీ విల్లాస్ కాలనీకి చెందిన అన్సర్ బాషా.. కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆయన డిప్యుటేషన్పై పంచలింగాల ఎస్ఈబీ చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు తెలంగాణలోని అలంపూర్ నుంచి కర్నూలు వైపు బైక్పై వెళ్తుండగా అన్సర్ బాషా గమనించారు. వారు మద్యం బాటిళ్లను అక్రమ రవాణా చేస్తున్నారని నిర్ధారించుకుని, ఎస్ఈబీ ఎస్ఐ జిలానీ బాషాతో కలిసి బైక్పై వారిని వెంబడించారు. ఈ క్రమంలోనే మునగాలపాడు వద్ద ప్రమాదవశాత్తూ నిందితుల వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో అన్సర్బాషా తీవ్రంగా గాయపడగా ఎస్ఐతో పాటు నిందితులు శ్రీనివాస్, సురేంద్రలకు గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్సర్ బాషా మృతి చెందారు.