భర్త శవానికి ఇంట్లోనే దహన సంస్కారం.. ఎంత విషాధం?
7631 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిభర్త మృతదేహానికి భార్య ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. పత్తికొండకు చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడగా.. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కృష్ణప్రసాద్ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు.. పోలీసులకు సమాచారం అందించారు. తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని పోలీసులకు లలిత తెలిపింది. కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె పోలీసులతో చెప్పారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ పడతారనే భయంతో తానే భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు చెప్పడం అందరినీ కలచివేస్తోంది.