నెల్లూరులో వైభవంగా రొట్టెల పండగ
నెల్లూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
నెల్లూరులో రొట్టెల పండుగ శనివారం ప్రారంభమైంది. ఈ పండుగలో భాగంగా ఆదివారం రాత్రి గంధ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ పండుగలో సుమారు 12 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకునే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా, పట్టుకున్నా కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పండుగ కోసం బారా షాహీద్ దర్గా, స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు.