ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఒంగోలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 15మందికి తీవ్ర గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు.చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సు ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1. అబ్దుల్ ఫ్లాజిజ్ (65 సం)2. అబ్దుల్ హనీ (60 సం)3. షేక్ రమీజ్ (48 సం)4. ముళ్ళ నూర్జహాన్ (58 సం)5. ముళ్ళ జానీ బేగం (65సం)6. షేక్ సబీనా. (35 సం)7. షేక్ హీనా (6 సం)