ఈ మధ్యన రొటీన్గా ఉన్నదేదీ ప్రజలకు ఓ పట్టాన నచ్చడం లేదు. అన్నింటిలోనూ వెరైటీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని క్యాచ్ చేశారు టంగుటూరు వైసీపీ నేతలు. నిరసనను కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు వైఎస్ఆర్సీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అవినీతికి పాల్పడ్డారని వీరు ఆరోపిస్తున్నారు. నిరసనగా సామూహిక బహిర్భూమి కార్యక్రమం నిర్వహించారు.