ప్రెస్మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి
1104 views
ఒంగోలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను టికెట్ ఇప్పించిన వారే తనపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. ‘వైఎస్సార్ మరణం నా రాజకీయ జీవితంలో తీరని లోటు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో నన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తామని చెప్పినా, లెక్క చెయ్యలేదు. జగన్ వెంటే నడిచాను. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఆయన వెంటే ఉన్నాను. అలాంటి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ బాలినేని భావోద్వేగానికి గురయ్యారు.