అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పంట నష్టంపై తమ బాధలు చెప్పుకుంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అకాల వర్షాలకు తోడు.. ప్రభుత్వ విధానాల వల్ల మరింత నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆవేదన చూసిన చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
rajahmundry|Curated byశివకుమార్ బాసాని|TimesXP TeluguUpdated: 4 May 2023, 8:22 pm