నరసాపురానికి నేనే ఎంపీని.. నన్ను పీకేవాడు ఎవ్వడూ లేడు: రఘురామ
1271 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు ఉండి టికెట్ వ్యవహారంపై స్పందించారు. "ఉండి సీటు నీకు అని చంద్రబాబు నాకు చెప్పలేదు. ఉండి సీటు నీకు లేదు అని రామరాజుకు కూడా చెప్పలేదు. నేనైతే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. కండీషన్లు పెట్టి నేను టీడీపీలో చేరలేదు. అలాగని నేను పోటీలో లేకపోతే ప్రజలు అంగీకరిస్తారని అనుకోవట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను పోటీలో ఉండటం పక్కా. అందులో అనుమానం లేదు. ఎమ్మెల్యేనే, ఎంపీనా అనేది చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఎక్కడనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. జూన్ నాలుగో తేదీ వరకూ నేను నర్సాపురం ఎంపీని. నన్ను పీకేవాడు ఎవడూ లేడు. విజయనగరం సీటు నేను అడగలేదు. కానీ అక్కడున్న వాళ్లు నన్ను ఆహ్వానించారు. ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటానని అనుకుంటున్నా" అని రఘురామకృష్ణరాజు చెప్పారు.