Rajahmundry: చంద్రబాబును కలిసిన అనంతరం ఎమోషనలైన భువనేశ్వరి
1661 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిNara Bhuvaneswari: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించారు. తన భర్త చంద్రబాబు నాయుడు 24 గంటలు ఆంధ్రప్రదేశ్ కోసమే కష్టపడేవారని నారా భువనేశ్వరి అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నారని ములాఖత్ తర్వాత భువనేశ్వరి పేరొన్నారు. అనంతరం తనలో ఒక భాగం అక్కడే ఉన్నట్టుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ముందు ప్రజలు ముఖ్యం.. ఆ తర్వాతే కుటుంబం అనే విషయాన్ని ఎప్పుడూ ఆయన చెబుతూ ఉండేవారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిర్మించిన ఆ బిల్డింగ్లోనే ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.