చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్
Rajahmundry: స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సోమవారం (సెప్టెంబర్ 18) కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, తప్పులు చేసిన నాయకులే ఆయనను ఈ కేసులో ఇరికించారన్నారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం వేధిస్తోందని, చంద్రబాబు జైలులో సంతోషంగా లేరన్నారు. పార్టీ కార్యకర్తల గురించి అడిగారని, వైసిపి ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదు.. ఆయనను ఉంచిన గదిలో దోమలు ఉన్నాయని యనమల పేర్కొన్నారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023