శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
srikakulamTimesXP TeluguUpdated: 6 Jun 2023, 5:07 pm