సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు: నటుడు సుమన్
1069 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండినటుడు సుమన్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు. తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల నుంచి బయటపడటం సంతోషకరం అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో నాడు ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతు ఇచ్చానని తెలిపారు. సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.