పెళ్లికి రెండు రోజుల ముందు యువకుడు మాయం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్లి
1079 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచిత్తూరు జిల్లాలో వరుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఇంతలోనే యువకుడు మాయం అయ్యాడు. సదుం మండలం బట్టువారి పల్లె పంచాయతీ ఎరుకులపురానికి చెందిన నవీన్కు.. యస్.ఆర్. పురం మండలానికి చెందిన లావణ్యతో ఈ నెల 29న వివాహం చేయాలని నిశ్చయించారు. నవీన్ తన పెళ్లికి బంధువులు, స్నేహితులను ఆహ్వానించేందు.. వారికి పెళ్లి శుభలేఖలు పంచడానికి మూడు రోజుల క్రితం వెళ్లాడు. అయితే, అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు ఇలా కనిపించకుండా పోవడం కలకలంరేపుతోంది. నవీన్ తల్లిదండ్రులు కూడా కంగారుపడుతున్నారు.. తమ కుమారుడికి ఏమైందోనని ఆవేదన చెందుతున్నారు.