తిరుమలకు పెంపుడు శునకంతో వెళ్లిన కుటుంబం.. వీడియో వైరల్
1413 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికర్ణాటకకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ట్రావెలర్ వాహనంలో వచ్చారు. ఆ ఫ్యామిలీ తమ వెంట పెంపుడు శునకాన్ని కూడా తీసుకొచ్చారు.. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బంది కుక్కను గమనించలేదు. ఆ తర్వాత వాహనంపై కొండపైకి చేరుకోగా.. వాహనంలో నుంచి కుక్క బయటకు చూస్తూ కనిపించింంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు మీడియా ప్రతినిధులు వీడియోను రికార్డ్ చేశారు. ఈ విషయం విజిలెన్స్ సిబ్బందికి తెలియడంతో వారు అప్రమత్తం అయ్యారు.. ఆ వాహనాన్ని వెతికి పట్టుకుని ఆ కుటుంబానికి చెప్పి కిందకు పంపించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం తిరుమలపైకి పెంపుడు జంతువులకు అనుమతి లేదని చెబుతున్నారు.. ఈ ఎపిసోడ్పై క్లారిటీ రావాల్సి ఉంది.