మోహన్ బాబు పుట్టినరోజును దివ్యాంగులతో జరుపుకున్న మనోజ్
1277 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివిలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తన పుట్టినరోజును( మార్చి19)న జరుపుకోనున్నారు .ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన తండ్రి పుట్టినరోజును ఈసారి కాస్త భిన్నంగా నిర్వహించారు. మోహన్ బాబు పుట్టినరోజు ముందస్తు వేడుకలను తిరుపతి జిల్లా రేణిగుంటలోని అభయక్షేత్రం అనే దివ్యాంగుల పునరావాస కేంద్రంలో నిర్వహించారు. దివ్యాంగుల మధ్య కేక్ కటింగ్ చేసి మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భార్యతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు మంచు మనోజ్. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏటా తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభయ క్షేత్రానికి రావడం జరుగుతుందని, అలాగే ఇవాళ తన భార్య మౌనికతో రావడం ఆనందంగా ఉందన్నారు. అభయక్షేత్రం నిర్వాహకులను సైతం అభినందించారు.