మీకు సిగ్గు, శరం ఉంటే మా పథకాలు తీసుకోకండి: వైసీపీ ఎమ్మెల్యే
1051 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి పేట అగ్రహారం గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో అవాక్కైన ఎమ్మెల్యే గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సిగ్గు శరం ఉంటే తమ ప్రభుత్వం ఇచ్చే పథకాలు వదులుకోవాలని నోరు జారారు. తాను వస్తున్నానని ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
tirupatiTimesXP TeluguUpdated: 25 May 2023, 1:45 pm