తిరుపతి లడ్డూకు 300 ఏళ్లు.. ఈ ప్రత్యేకతలు తెలుసా?
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
Tirupati laddu singnificance: తిరుపతి లడ్డూకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమలకు వచ్చే యాత్రికులు ఆ శ్రీనివాసుడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే అనుభూతికి లోనవుతారు. అలాంటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డూ.. మూడు వందల ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామి వారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి 308 ఏళ్లు పూర్తయినట్లు పండితులు చెబుతున్నారు. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. తిరుపతి లడ్డూ మరిన్ని ప్రత్యేకతలు వీడియోలో..