తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
1126 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమంజనం సందర్భంగా.. ఆలయ ప్రాంగణం, వస్తువులు, పూజా సామాగ్రి, గోడలు, పూజా సామాగ్రి సహా శ్రీవారి ఆలయాలలోపల ఉన్న చిన్నచిన్న గుళ్లను కూడా శాస్త్రోక్తంగా శుద్ధి చేయడాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. జులై 17న శ్రీవారి ఆణివార ఆస్థానం సందర్భంగా శుద్ధి చేశారు. తిరుమంజనం పూర్తైన తర్వాత స్వామివారికి పూజలు నిర్వహించి.. అనంతరం వెంకన్న దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. ప్రతి ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. తిరుమంజనం కారణంగా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటుగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన సంగతి తెలిసిందే.