తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. తన నివాసం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానపద కళాకారులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 10 May 2023, 1:23 pm