తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్ల నాటి రావి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప (70) మృతి చెందారు. గతంలో ఆయన స్విమ్స్లో వైద్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్న గుర్రప్ప.. తిరుపతి స్విమ్స్లో మెడిసిన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చారు. గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చి ప్రమాదానికి గురయ్యారు.
tirupatiTimesXP TeluguUpdated: 1 Jun 2023, 7:37 pm