సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు కొండ పైకి వస్తుంటారు. వారిలో చాలా మంది తమ సొంత వాహనాల్లో తిరుమల కొండకు వస్తుంటారు. అయితే, తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో తిరుమల పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. ఘాట్ రోడ్లలో డ్రైవింగ్పై అవగాహన లేకపోవడం, కాలం చెల్లిన వాహనాల కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు.. ఘాట్ రోడ్ల గురించి అవగాహన ఉన్న డ్రైవర్లతో రావాలని సూచిస్తున్నారు. వీటితో పాటు భక్తుల రక్షణ కోసం పలు సూచనలు చేశారు..tirupatiTimesXP TeluguUpdated: 31 May 2023, 11:23 pm