శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలపైకి బైకులు నిషేదం
81633 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం జరుగనున్న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.