తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి.. కిందపడిన హుండీ
1443 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీవారి హుండీ కిందపడి.. అందులోని కానుకలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆలయం నుంచి హుండీని పరకామణికి తీసుకెళ్తున్న సమయంలో ఆలయ మహాద్వారం దగ్గర హుండీ జారి కిందపడిపోయింది. హుండీలో ఉన్న కానుకలు కిందపడిపోయాయి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ కానుకల్ని జాగ్రత్త చేశారు. తర్వాత హుండీని లారీలోకి చేర్చి పరకామణికి తరలించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో భక్తులు కానుకలు వేస్తుంటారు.. అలా హుండీ నిండిపోగానే బయటకు తీసుకొస్తారు.. అక్కడి నుంచి పరకామణి భవనానికి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది.. సిబ్బంది నిర్లక్ష్యంతోనే శ్రీవారి హుండీ ఇలా కిందపడినట్లు చెబుతున్నారు.