వామ్మో ఇదంతా బంగారమే.. తిరుపతిలో భక్తుడు
8551 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిTirupati: తిరుమలో ఓ భక్తుడు ఒంటి నిండా బంగారంతో సందడి చేశాడు. గురువారం (మార్చి 14) ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దాదాపు 10 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వివరాలు తీయగా.. హైదరాబాద్కు చెందిన కొండా విజయ్కుమార్ అని తెలిసింది. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన విజయ్ కుమార్తో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మెడలో బరువైన బంగారు చైన్లు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్తో తిరుమల ఆలయం ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ కుమార్ ‘హోప్ ఫౌండేషన్’ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత డబ్బులతో నిరుపేద భక్తులను దర్శనాలకు తీసుకురావడం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. ‘స్వామి వారి ఆశీస్సులతో ప్రతి రోజు మా ఫౌండేషన్ ద్వారా వందలాది భక్తులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి దర్శనం కల్పించే అవకాశం కల్పించాలని స్వామి వారిని కోరుకున్నాను. ప్రతి నెలా కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నాను’ అని విజయ్ కుమార్ తెలిపారు. విజయ్ కుమార్తో పాటు ఫౌండేషన్ సభ్యులు ఘాలి కృష్ణ, రవికుమార్, కిరణ్ , మారం ప్రసాద్ ఉన్నారు.