కాలినడకన 400 సార్లు తిరుమల కొండ ఎక్కి.. శ్రీవారిని దర్శించుకున్న మహా భక్తుడు..
81997 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిSrikakulam Devotee: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటేనే తన్మయత్వంతో పరవశించి పోతుంటారు భక్తులు. జీవితంలో ఒక్కసారైనా కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు భక్తులు. అలాంటిది 400 సార్లు మెట్లమార్గంలో తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు ఓ పరమభక్తుడు. శ్రీకాకుళానికి చెందిన మహాంతి శ్రీనివాసరావు అనే భక్తుడు ఇప్పటివరకు 400వ సారి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గతంలో 399సార్లు కాలినడకన కొండెక్కిన ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 29) 400వ సారి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో 1996వ సంవత్సరంలో మొట్టమొదటి సారి కాలినడకన తిరుమలకి చేరుకున్న శ్రీనివాసరావు అప్పటి నుంచి మెట్ల మార్గంలోనే నడుచుకుంటూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా 400వ సారి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయనని దారి మధ్యలో అనేక మంది భక్తులు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... తనకు శక్తి ఉన్నంతవరకు కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటూనే ఉంటానని చెప్పారు.