శ్రీవారి దర్శనానికి కొండంత క్యూ.. భారీగా తరలివచ్చిన భక్తులు
తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులతో పాటు వారాంతం కావడంతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం (మే 27) సాయంత్రానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.tirupatiTimesXP TeluguUpdated: 27 May 2023, 8:53 pm