ఆస్ట్రేలియాలో మృతి చెందిన తెలుగు డాక్టర్
1923 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిస్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రెక్కింగ్కు వెళ్లిన తెలుగు డాక్టర్ ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన 23 ఏళ్ల వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్కోస్ట్లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. మార్చి 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ఉజ్వల భౌతిక కాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆస్ట్రేలియా నుంచి శనివారం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చారు. ఈరోజు ఉజ్వల అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.