ఉద్యోగులకు ఎంత వీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీపీఎస్ కోసం రెండేళ్లుగా కసరత్తు చేశామని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు అని.. వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారని జగన్ వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో జీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
vijayawada|TimesXP Telugu|Updated: 9 Jun 2023, 7:40 pm