ఉప్పొంగిన మున్నేరు వాగు.. హైదరాబాద్- విజయవాడ హైవేపై రాకపోకలు బంద్
1721 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి (NH-65) పైకి భారీగా వరద నీరు చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వందలాదిగా వెహికల్స్ జాతీయ రహదారికి రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వెహికల్స్ బారులు తీరాయి. వరద ధాటికి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వాహనదారులు వరదనీటిలోనే నెమ్మదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారు. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు కలుస్తాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.