ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ ముందు కాదు: రోజా
1712 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిNandamuri Balakrishna: బాలకృష్ణ మీసం మెలేస్తే భయపడేవారెవరూ లేరిక్కడ అంటూ ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఎప్పుడూ షూటింగ్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్లలో ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటూ ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడడం, నియోజకవర్గాన్ని గాలికొదిలేయడం, అసెంబ్లీకి రాకపోవడం.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు నువ్వొచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు’ అని రోజా అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుందనేది తేలుతుందని ఆమె అన్నారు. ప్రజా డబ్బును దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేదన్నారు. బాలకృష్ణకు ఆయన సినిమా డైలాగ్తోనే రివర్స్ పంచ్ ఇచ్చారు. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ మోహన్ రెడ్డి ముందు కాదు’ అని రోజా అన్నారు.