కాకినాడ నుంచి లోక్సభకు పవన్ పోటీ! కేంద్రమంత్రి కాబోతున్న జనసేనాని
1385 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ లీడర్ కనకమేడల రవీంద్ర కుమార్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీచేస్తాయని తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న ఆయన.. సీట్ల లెక్కలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. పొత్తుల వలన టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.మరోవైపు సీట్ల లెక్కలపైనా మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. టీడీపీ 145 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ, జనసేనకు కలిసి 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు రెండు, బీజేపీకి ఆరు లేదా జనసేనకు మూడు, బీజేపీకి ఐదు సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేస్తారని.. ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలిసింది. కాకినాడలో జనసేన పార్టీకి బలం ఉండటంతో పాటుగా పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలపైనా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది.