టీడీపీ-జనసేన తొలి జాబితా: టీడీపీ 94 మంది అభ్యర్థులు వీరే..
AP Assembly Elections 2024: టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల తరఫున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైనుంచి ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలు కేటాయించారు. టీడీపీ తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. పవన్ కళ్యాణ్ 5 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాక, టీడీపీ పోటే చేసే మొత్తం స్థానాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.