విజయవాడ నగరంలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిఫిన్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ తిన్నారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చారు. మంచి ఇడ్లీ అందిస్తున్నారని.. హోటల్ యజమాని కృష్ణను వెంకయ్యనాయుడు అభినందించారు.
vijayawadaTimesXP TeluguUpdated: 2 May 2023, 3:54 pm