రూ.20వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సచివాలయ వార్డ్ అడ్మినిస్టేటివ్
2822 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విశాఖపట్నం ప్రశాంతి నగర్ సచివాలయ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ డి.భాస్కరరావు. జీవీఎంసీ 79వ వార్డు పాత అగనంపూడికి చెందిన ఎం.సోమునాయుడు తన తల్లి పేరిట ఉన్న ఇంటి పన్నును తన పేరిట మార్చుకునేందుకు ఇటీవల ప్రశాంతినగర్ సచివాలయంలో దరఖాస్తు చేశారు. అలాగే తన మరో మూడు ఇళ్లకు పన్ను వేయాలని కోరుతూ అదే సచివాలయంలో వేర్వేరుగా దరఖాస్తులు చేశారు. మొత్తం నాలుగు దరఖాస్తులకు ఆమోదం తెలపడానికి సచివాలయ పరిపాలన కార్యదర్శి డి.భాస్కరరావు రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఇద్దరు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సోమునాయుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు సచివాలయంలో కార్యదర్శి భాస్కరరావు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.