విహారయాత్రల పేరుతో విశాఖ వాసులకు టోకరా
20169 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివిశాఖలో టూరిజం పేరుతో జరుగుతున్న భారీ స్కామ్ బయటపడింది. లక్కీడిప్ పేరుతో తమ కార్యాలయానికి పిలిచి బుట్టలో వేసుకుంటారు. చాలా తక్కువ ఖర్చుతో విహారయాత్రకు తీసుకెళతామని నమ్మిస్తారు.. అలా డబ్బులు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేస్తారు. వీరు గతంలో విహార యాత్ర పేరుతో సుమారు 200 మంది దగ్గర నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.. తిరిగి ప్రజలను మోసం చేసేందుకు వండర్ టూర్స్ పేరుతో మళ్లీ ప్రారంభించగా.. బాధితులు ఆందోళనకు దిగారు. ఇద్దరు అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.