విశాఖ: రూ.లక్ష కోట్ల డ్రగ్స్ వ్యాపారం.. వాళ్లను ఉరేయాలి.. మాజీ మంత్రి
1149 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివిశాఖపట్నంలో దొరికిన డ్రైడ్ ఈస్ట్ (నిషేధిత డ్రగ్స్)పై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో లక్ష కోట్ల రూపాయల మేర డ్రగ్స్ దందా సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇంటర్ పోల్ సమాాచారంతో సీబీఐ రంగంలోకి దిగి సరుకును పట్టుకుందని, ఇలాంటివి ఐదేళ్లలో ఎన్ని చేశారో? తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంధ్య ఆక్వా సంస్థ ఉద్యోగులు.. కంటెయినర్ చూడ్డానికి వీల్లేదని అడ్డుకున్నారంటే దీని వెనుక ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నాయో అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చేసిందని ధ్వజమెత్తారు.