Vizag Harbour: విశాఖపట్నం హార్బర్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో బోట్లు తగలబడిపోయిన ఘటనపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరం కాలిపోతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించరా అని పాల్ ప్రశ్నించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వరు. స్పెషల్ స్టేటస్ ఇవ్వరు. పోలవరం కట్టరు. మత్స్యకారులను ఆదుకోరు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు?’ అంటూ బీజేపీని ఉద్దేశించి పాల్ ప్రశ్నించారు. తెలుగు వారి సత్తా ఒక్కసారైనా చూపిద్దాం అంటూ వీడియో సందేశం విడుదల చేశారు.
visakhapatnam|Authored byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 21 Nov 2023, 6:09 pm