పవన్కు దుబాయ్ నుంచి రూ.1500 కోట్లు ముట్టాయి: కేఏ. పాల్
చంద్రబాబు నుంచి రూ.1,500 కోట్లు పవన్కు ముట్టాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. హాంకాంగ్, దుబాయ్ లనుంచిడబ్బులు అకౌంట్లో పడ్డాయని.. అందుకోసం 25 సీట్లకు పరిమితమైపోయారన్నారు. పవన్ ను నమ్ముకుంటే కాపులు గుండు కొట్టించుకోవాల్సిందే అన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడని వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని.. అందువల్లే పవన్ వెంట కాపులు లేరన్నారు. వారిద్దరూ కాపులను అమ్ముకోవడానికే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు పెట్టారని చిరంజీవి, పవన్లను ఉద్దేశించి అన్నారు. 2019లో జనసేనలో లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ ఇద్దరే చేరారని, ఎన్నికలు అయిపోయిన వెంటనే వారూ బయటకు వచ్చారని గుర్తు చేశారు. కేవలం పార్టీలను అమ్ముకోడానికే రాజకీయాలు చేస్తున్నారన్నారు.
Authored byCurated byతిరుమల బాబు|TimesXP Telugu|18 Sept 2023