మంచం పట్టిన మాజీ మంత్రి.. ఆ బెంగే కారణమా!
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆస్పత్రి పాలయ్యారు. సత్యనారాయణ మూర్తి అనారోగ్యానికి గురికావటంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. స్వగ్రామం వెన్నెలపాలెంలో ఉన్న సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు ఆసుపత్రి వద్ద వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టికెట్ రాలేదనే బెంగతోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. అనుచరులు చెబుతున్నారు.