ఒక్కసారి బ్రాహ్మణి బయటకు వస్తేనే వైసిపి వణికిపోతుంది: వంగలపూడి అనిత
visakhapatnam: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు చేయించి సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పసలేదని, అది చిన్న పిల్లాడు కూడా చెబుతాడని తెలిపారు. నిరోద్యోగులైన యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పించిన గౌరవ చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. అంతేకాక ఆయనను ఎక్కడ మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ అడగలేదని, క్వాష్ పిటిషన్ వేశారని అనిత స్పష్టం చేశారు. అనంతరం వైసిపి మంత్రి రోజాను ఉద్దేశిస్తూ.. ఏనాడూ రాజకీయాల వైపు చూడని నారా బ్రాహ్మణి ఒక్కరోజు బయటికి వచ్చి కొవ్వొత్తి పట్టుకునే సరికి వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023